షకీలా..
సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం
చేయాల్సిన అవసరంలేని పేరు. సౌత్ సినిమాల్లో ఎక్కువుగా
నటించిన షకీలా కి మళయాళ శృంగార చిత్రాలతో ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆమె అలాంటి
చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిగా
గుర్తింపు తెచ్చుకుంది. 100 కు పైగా సినిమాల్లో నటించిన షకీలా తమిళం మళయాళం తెలుగు
కన్నడ హిందీ సినిమాలలో కనిపించింది. అయితే షకీలా కొన్నేళ్ల నుండి అస్లీల పాత్రలు
తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది. కాగా ''షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ
కథా చిత్రమ్'' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విక్రాంత్ -
పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో
కనిపించనుంది. వీఎన్ సతీష్ ఈ సినిమాకి స్టోరీ - డైలాగ్స్ - డైరెక్షన్ చేయగా
సాయిరామ్ దాసరి కాన్సెప్ట్ - స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్
పూర్తి చేసుకొని ఈ సినిమాకి క్లీన్ యూ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. అటు షకీలా
సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో కానీ ఇదే తొలి క్లీన్ యూ
సర్టిఫికెట్ సినిమా కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్
విడుదల చేశారు చిత్ర యూనిట్. ''కుటుంబ కథా చిత్రం అంటే ఒక ఇంట్లో తీస్తారు.. అడల్ట్ సినిమా
అయితే ఒక రూమ్ లో తీస్తారు.. అంతేగా.. దీని కన్నా పగిలిపోయే కుటుంబ కథా చిత్రం
నేను రాస్తాను'' అనే షకీలా డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ
చిత్రానికి సంబంధించిన టీజర్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల
ప్రస్తావన తెచ్చిన ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ లో మాత్రం ఎలాంటి వివాదాలకు తావులేకుండా
చూసుకుంది. కాగా సి.హెచ్. వెంకట్ రెడ్డి తన 24 క్రాఫ్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని
నిర్మించారు. లండన్ గణేష్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు మధు పొన్నస్
సంగీతం అందించారు. ''షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రమ్''
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో
ప్రకటించకపోయినా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే
స్ట్రీమింగ్ సూన్ అని మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. కాకపోతే ఏ డిజిటల్ ఫ్లాట్
ఫార్మ్ లో విడుదల అవుతుందో అని మాత్రం ప్రకటించలేదు.
0 Comments