కార్తీకి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని రీజినల్ హీరో అయితే బాగుంటుందని మళ్లీ హీరో రానాను ఫిక్స్ అయ్యాను.
ఇక వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్లి రానాకి కథ చెప్తే వెంటనే ఓకే చేసి డేట్స్ ఇచ్చేసాడు. ఇక అలాగే నేను ఈ సినిమాలో ఫస్ట్ నుండి కూడా హీరోయిన్గా సాయిపల్లవినే అనుకున్నాను. వెళ్లి స్క్రిప్ట్ వినిపించగానే ఓకే చెప్పింది. నిజానికి సాయిపల్లవి నా మొదటి సినిమాలోనే చేయాల్సింది కానీ ఆ టైంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు.
కానీ ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ ఇరగదీసింది. 1990ల నాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో ఫేమస్ యాక్టర్ నందితా దాస్ ప్రియమణి ఈశ్వరి రావు జరీనా వాహిబ్.. ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90శాతం ముగిసిందని డైరెక్టర్ తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. డి. సురేష్ బాబు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
0 Comments