Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

Rana Is Second Hero On Virataparvam Movie.



Tollywood News

టాలీవుడ్ లో 'నీది నాది ఒకే కథ' సినిమాతో మంచి విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఉడుగుల. తన రెండో సినిమాగా విరాటపర్వం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చాలా ఆలస్యం అయింది. లేదంటే ఈపాటికి థియేటర్లలో సందడి చేసి ఉండేది. అయితే ఇటీవలే ఈ సినిమా గురించి డైరెక్టర్ వేణు ఊడుగుల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. "నిజానికి ఈ సినిమా కథ రాసుకునే టైంలో నా మైండ్ లో హీరోగా కేవలం తమిళ హీరో కార్తీనే ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు కార్తీ కేవలం తమిళంలోనే ఎక్కువ మార్కెట్ కలిగి ఉన్నాడు.
Tollywood News
కార్తీకి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని రీజినల్ హీరో అయితే బాగుంటుందని మళ్లీ హీరో రానాను ఫిక్స్ అయ్యాను.
ఇక వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్లి రానాకి కథ చెప్తే వెంటనే ఓకే చేసి డేట్స్ ఇచ్చేసాడు. ఇక అలాగే నేను ఈ సినిమాలో ఫస్ట్ నుండి కూడా హీరోయిన్గా సాయిపల్లవినే అనుకున్నాను. వెళ్లి స్క్రిప్ట్ వినిపించగానే ఓకే చెప్పింది. నిజానికి సాయిపల్లవి నా మొదటి సినిమాలోనే చేయాల్సింది కానీ ఆ టైంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు.
Tollywood News
కానీ ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ ఇరగదీసింది. 1990ల నాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో ఫేమస్ యాక్టర్ నందితా దాస్ ప్రియమణి ఈశ్వరి రావు జరీనా వాహిబ్.. ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90శాతం ముగిసిందని డైరెక్టర్ తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. డి. సురేష్ బాబు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments