ఇది
కృష్ణా జిల్లా కోలవెన్ను మండల పరిషత్ మోడల్ స్కూల్.. ఎండలున్నా, కరోనా ఉన్నా పనులు
జరుగుతూనేఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు దాసరి
ఏసుదాసు, పాఠశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ శిరీష, సభ్యుడు
పున్నాని సురేష్లు ఇక్కడ మూడు నెలలుగా పనులు చేయిస్తున్నారు. కూలీలను
పురమాయిస్తూ.. తాపీ మేస్త్రీతో మాట్లాడుతూ పనులు జరుగుతున్న తీరును వివరించారు.‘ప్రభుత్వం ఎంతో మంచి
ఉద్దేశంతో ఈ పనులకు అవసరమైన నిధులతోపాటు పనులు చేపట్టే బాధ్యత కూడా పేరెంట్స్
కమిటీలకు ఇచ్చింది. మా స్కూలును 1935లో కట్టారు. చాలా పాత
భవనం. ఈ భవనాన్ని పడగొట్టకుండా బాగు చేయడానికి చాలా కష్టపడ్డాం. మినరల్ వాటర్,
మరుగుదొడ్లు, కిచెన్, రంగులు,
ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని
చెప్పారు. ‘ఇప్పటి వరకు రూ.21 లక్షలు
ఖర్చయింది. ఇంకా ఎంతైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మా స్కూలులో గత
ఏడాదిలో ఒక్కసారిగా ప్రయివేటు పాఠశాలల పిల్లలు 35 మంది వచ్చి
చేరారు. ఇప్పుడు 5 తరగతులు కలిపి 67
మంది పిల్లలున్నారు. ఇప్పుడు స్కూలులో అన్ని సౌకర్యాలను చూసి ఈ ఏడాది 100కు పైగా పిల్లలు పెరిగే పరిస్థితి ఉంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక చూస్తే
కార్పొరేట్ స్కూల్ కంటే అద్భుతంగా ఉంటుంది’ అని వారు ఆనందంగా చెప్పారు.
0 Comments